Bhupendra Patel: మోదీ రికార్డునే బ్రేక్ చేసి.. భూపేంద్ర పటేల్ గురించి ఈ విశేషాలు తెలుసా?
అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలిసారే ముఖ్యమంత్రి బాధ్యతలు అందుకున్న భూపేంద్ర పటేల్.. వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్(Gujarat) ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. భూపేంద్రతో పాటు మరో 16 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) సహా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రికార్డునే బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో సీఎం బాధ్యతలు అందుకున్నారు. 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భాజపా 156 స్థానాలు గెలుచుకుని వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేసిన భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా భూపేంద్రుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే..
2021 సెప్టెంబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్కు పగ్గాలు అప్పగించారు. రూపానీ రాజీనామా తర్వాత అనేక మంది సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పటేల్కు సీఎం బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, భూపేంద్ర పటేల్ అప్పటికి ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఒక్కసారే. 2017 ఎన్నికల్లో ఆయన గెలుపొంది మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కీలక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులై భూపేంద్ర పటేల్ అరుదైన ఘనత సాధించారు.
మోదీ రికార్డునే బద్దలుకొట్టి..
2002లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 127 స్థానాల భారీ మెజార్టీతో విజయం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో సీఎం బాధ్యతలు అందుకోబోతున్నారు. ఇక, మోదీకి, భూపేంద్ర పటేల్కు ఓ సారూప్యత కూడా ఉంది. పటేల్ ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే గతేడాది తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రధాని మోదీ కూడా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.
పాటీదార్ వర్గం నుంచి ఐదో సీఎం..
రూపానీని గద్దెదించి భూపేంద్ర పటేల్కు సీఎం పగ్గాలు అప్పగించడం వెనుక గుజరాత్లో జరిగిన పాటీదార్ వర్గ ఆందోళనే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పాటీదార్ల డిమాండ్ మేరకే భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. అది కలిసొచ్చి తాజా ఎన్నికల్లో పాటీదార్ల ప్రాబల్యమున్న స్థానాల్లో భాజపా ఘన విజయం సాధించింది. అందుకే రెండో దఫా కూడా ఆయనకే సీఎం బాధ్యతలు కట్టబెట్టింది. పటేల్ వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఐదో వ్యక్తి భూపేంద్ర. అంతకుముందు ఆనందీబెన్ పటేల్, కేశుభాయ్ పటేల్, బాబుభాయ్ పటేల్, చిమన్భాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆరంభమే రికార్డు..
గుజరాత్ మాజీ సీఎం, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్కు భూపేంద్ర అత్యంత నమ్మకస్థుడు. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017లో తొలిసారి పోటీ చేసిన ఆయన.. 1.17 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తికాంత్ పటేల్పై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఘట్లోడియా స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన ఆయన .. ఈ సారి ఏకంగా 1.92లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మరో ఘనత దక్కించుకున్నారు.
ఇతర విశేషాలు..
* 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశారు.
* అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా, పురపాలక సంఘం స్థాయీ సంఘం ఛైర్మన్గా, మున్సిపల్ పాఠశాలల కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
* ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మృదుభాషి. అందరూ ‘దాదా’ అని ఆప్యాయంగా పిలుస్తారు.
* పటేల్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. రాజకీయాల్లోకి రాకముందు నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహించేవారు. ఆర్ఎస్ఎస్తోనూ అనుబంధం ఉంది. భాజపాలో ఈయనను ట్రబుల్ షూటర్, వ్యూహకర్తగా పిలుస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.