21న చలో అసెంబ్లీ: కోదండరామ్
స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ఒక చట్టం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు....
హైదరాబాద్: స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ఒక చట్టం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1.48లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, కొత్త మండల్లో దాదాపు 50,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగయాత్ర చేయాల్సి రావడం దారుణమన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. సాదాబైనామాలు, పోడు భూములు, అసైన్డ్ భూములు, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత లేదన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.
స్వామి అగ్నివేశ్ మృతికి సంతాపం
సామాజిక ఉద్యమకారుడు, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతికి కోదండరామ్ సంతాపం తెలిపారు. అగ్నివేశ్ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే