Telangana News: నాలుగైదుసార్లు ఓడిపోయిన వాళ్లతో నేను కూర్చోవాలా?: కోమటిరెడ్డి

పార్టీ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే తాను మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయినట్లు కోమటిరెడ్డి చెప్పారు.

Updated : 12 Jan 2023 12:52 IST

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం అల్పాహార విందులో ఠాక్రేతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే నేను మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయాను. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు ఠాక్రేను ఎందుకు కలవలేదో ముందు అడగాలి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో నేను కూర్చోవాలా?’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని