Munugode bypoll results: కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస విజయం: కూనంనేని
వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత మునుగోడు ఉప ఎన్నిక ద్వారా మరోసారి స్పష్టమైందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస గెలిచిందన్నారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో భాజపా ఓటమి ఒక్క రాజగోపాల్రెడ్డికే కాదు, నరేంద్రమోదీకి చెంపపెట్టు లాంటి తీర్పు అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లోని ముగ్దూం భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. డబ్బులు ఉన్నాయి, భాజపా అండ ఉంది కాబట్టి గెలవొచ్చని భావించారు. కానీ, ఇవాళ మా నైతిక విజయమని రాజగోపాల్రెడ్డి చెబుతున్నారు. మునుగోడులో భాజపా ఓటమి, తెరాస గెలుపు.. ప్రజాస్వామ్యానికి లభించిన విజయంగా మేం భావిస్తున్నాం. మునుగోడు ఫలితం భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి దోహద పడుతుంది.
వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత మునుగోడు ఉప ఎన్నిక ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణలో పాగా వేయాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భాజపా చూస్తోంది. గతంలో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈసారి ఆ పార్టీ గెలవలేదు. మునుగోడులో కాంగ్రెస్కు పెద్ద తలకాయ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తలకు రాజగోపాల్రెడ్డికే ఓటు వేశారు. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. భవిష్యత్లో తెరాస, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండే అవకాశముంది. భాజపాను ఓడించే శక్తితో కలిసి పనిచేసేందుకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భాజపాను తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా చేస్తాం. కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస గెలిచింది. భాజపాను ఓడించేందుకు అందరం కలవాల్సిన అవసరముంది’’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్