KTR: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి మాపై విమర్శలా?: కేటీఆర్
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,
హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. తెరాస పాలనపై మహబూబ్నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
మోదీ పాలనలో నిరుద్యోగం 45ఏళ్ల గరిష్ఠానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లోనే వంట గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని భాజపా నేతలు తెలంగాణకు వచ్చి తెరాస పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.