KTR: చేనేత రంగంపై ప్రధాని మోదీ నిర్ణయం అనాలోచితం: మంత్రి కేటీఆర్
ప్రధాని నరేంద్రమోదీ ఎందుకో చేనేత రంగంపై కత్తిగట్టినట్టు అనిపిస్తోందని.. ఈ 8 ఏళ్లలో చేనేత రంగంపై మోదీ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ చేయని ఒక ఆలోచన ప్రధాని మోదీ చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్: భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ప్రజలకు ఉపాధి కల్పించే రంగం చేనేత అని మంత్రి కేటీఆర్ అన్నారు. బడ్జెట్ పద్దుపై చర్చలో భాగంగా చేనేత రంగం, కార్మికులపై పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి రూ.70 కోట్లు కేటాయించింది. ఇవాళ తెలంగాణ సర్కార్ ఈ రంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడమే కాకుండా చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. అయితే, ప్రధాని నరేంద్రమోదీ ఎందుకో ఈ రంగంపై కత్తిగట్టినట్టు అనిపిస్తోంది. ఈ 8 ఏళ్లలో చేనేత రంగంపై మోదీ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ చేయని ఒక ఆలోచన మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపైన 5 శాతం పన్ను విధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని ఎన్ని ఉత్తరాలు రాసినా ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. 5 శాతం ఉన్న పన్నును 12శాతానికి పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఈ 5 శాతం పన్నును పూర్తిగా తీసేసి గతంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాలి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.
చేనేతపై కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలివే..
* ఆల్ ఇండియా హ్యాండీక్రాప్ట్స్ బోర్డును రద్దు చేశారు.
* ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డును తీసేశారు. తద్వారా దాని కింద అనుబంధంగా పనిచేసే 8 టెక్స్టైల్ పరిశోధనా సంస్థలు నిర్వీర్యం అయ్యాయి.
* హైదరాబాద్లో ఉండే ఆల్ ఇండియా జూట్ బోర్డు కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తొలగించారు.
* చేనేత సహకార సంఘం సభ్యుల త్రిఫ్ట్ ఫండ్ పథకంలో 4 శాతంగా ఉన్న కేంద్ర వాటాను రద్దు చేశారు.
* చేనేత కార్మికల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఆరోగ్య బీమా, బుంకర్ బీమా యోజనా పథకాలను తీసేశారు.
* హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాన్ని రద్దు చేశారు.
* కేంద్రం మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం నిబంధనలు మార్చేసి అందని ద్రాక్షలా మార్చేశారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రధానిని కలిసినా ఫలితం లేదు..
‘‘ఉమ్మడి ఏపీలో నెల్లూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉండేది. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు ఆ తరహా సంస్థ లేకుండా పోయింది. ఇక్కడి నేతన్నల భవిష్యత్తు, కొత్త తరం వారి కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరాం. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని కోరినా స్పందన రాలేదు. ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని ఇప్పటికీ కోరుతూనే ఉన్నాం.
బండి సంజయ్ ఉన్నా వారికి ప్రయోజనం లేదు..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న లోక్సభ నియోజకవర్గంలోనే మూడు ప్రధాన (సిరిసిల్ల, కమలాపూర్, చొప్పదండి) చేనేత స్థావరాలు ఉన్నాయి. ఒక పార్టీ అధ్యక్షుడు ఆ ప్రాంతం నుంచి ఉన్నప్పటికీ అక్కడి చేనేత కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు వాతలు పెడుతూ వెళ్తుంటే.. తెలంగాణ సర్కారు పూర్తి స్థాయిలో గణాంకాలు సేకరించి అనేక కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చింది. నూలు, రసాయనాల మీద దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం రాయితీ ఇచ్చేలా చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా కరోనా సమయంలో 26వేల చేనేత కుటుంబాలకు రూ.100 కోట్ల మేర లబ్ధిచేకూరింది’’ అని కేటీఆర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!