పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమెవరు?: కేంద్ర మంత్రిని ప్రశ్నించిన కేటీఆర్
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా? అని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పురిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి చేసిన ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు....
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా? అని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పురిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి చేసిన ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో పన్నులు పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యాట్ పెంచలేదన్నారు. క్రూడ్ ఆయిల్ ధర 2014లో 105 డాలర్లు ఉండగా ఇప్పటికీ అంతే ఉందన్న కేటీఆర్... పెట్రోల్ ధర మాత్రం రూ.70 నుంచి 120కి ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. కేంద్రంలోని నాన్ పర్ఫామెన్స్ అసెట్స్, పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా అని నిలదీశారు. రాష్ట్రాలకు నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే పెట్రోలు రూ.70కి, డీజిల్ రూ.60కి ఈ దేశ ప్రజలకు అందించే వీలుందన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చెబితే మంచిదన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్సుల రూపంలో ఇప్పటివరకు రూ.26 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది నిజం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?