KTR: ఆ సంస్కరణలు వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు: కేటీఆర్
రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్రం విద్యుత్ సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
సిరిసిల్ల: రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతులేన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, రైతు తన పొలంలోనే కూలీగా మారుతారని వ్యాఖ్యానించారు. వస్త్ర వ్యాపార పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘‘వ్యసాయాన్ని, విద్యుత్ను కార్పోరేట్ల కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పి ఎక్కువ రోజులు కాలేదు. మోదీ సర్కార్ విద్యుత్, వ్యవసాయంపై కక్షగట్టింది. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోంది గనక ప్రైవేటుపరం చేస్తామంటూ నిన్న కేంద్ర సాగు కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని ప్రకటన చేయడం దారుణం’’ అన్నారు.
‘‘ఆహార భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రాలు పండించే ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. దానికి మంగళం పాడటమే కాకుండా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎలాంటి చర్చలు లేకుండా చట్టాలు గెజిట్లు తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. దేశంలోని రైతుల్లో 95శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరిపై మోదీకి అసలు అవగాహనే లేదు. కుక్కను చంపే ముందు పిచ్చికుక్క అని ప్రచారం చేస్తారని అంటారు కదా.. అదే రీతిలో ఇప్పుడు విద్యుత్తు, వ్యవసాయ విధానంపై వ్యవహరిస్తున్నారు. రూపాయి పాతాళానికి పోయింది. నైజీరియాను దాటి భారతదేశం పేదరికం చేరిందని నివేదికలు చెబుతుంటే మోదీ ఇంకా అస్తవ్యస్థ విధానాలతో దివాళా తీయిస్తున్నారు. కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి గల్లీకో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తున్నారు. తన మిత్రుడిని అపరకుబేరుడిగా చేసే వరకు ప్రధాని మోదీ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
విద్యుత్ సంస్కరణలతో వ్యవసాయం, టెక్స్టైల్, ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రహ్మణులకు ఇస్తోన్న సబ్సిడీలు ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ సంస్థలకు అప్పు పుట్టకుండా రోడ్డున పడేలా చేస్తున్నారు.. రాష్ట్రంలో 26లక్షల పంపు సెట్లు ఉన్నాయి.. మరి వీటికి విద్యుత్ ఇవ్వకపోతే ఈ రైతులు ఎక్కడికి పోవాలో సమాధానం చెప్పాలి. కేంద్రం కుట్రలు కొనసాగితే మాత్రం రేపటి రోజు దేశంలోనే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణా రాష్ట్రమే. రైతు తన పొలంలో తానే కూలిగా మారే పరిస్థితి వస్తుంది. ప్రైవేటు కంపెనీలు విద్యుత్ రంగంలోకి అడుగుపెడితే పెట్రోల్, డీజిల్ లెక్క రోజు ధరలు మారతాయి.. ఇది ఏమాత్రం సరైనది కాదు. ఒకసారి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి నవ్వులపాలయ్యారు.. ఇప్పుడు దొడ్డిదారిన విద్యుత్ను ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనమంటే కేంద్రం సిగ్గు లేకుండా బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పింది. నాలుగు రోజులు గడవక ముందే ఎగుమతులపై ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఏ పిలుపునిస్తే దానికి సిద్ధంగా ఉండాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్