KTR: హైదరాబాద్ రోజురోజుకీ విస్తరిస్తోంది: కేటీఆర్
శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరం రోజురోజుకీ విస్తరిస్తోందన్నారు.
శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరం రోజురోజుకీ విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్ను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నగరంలోని నీటి అవసరాలు, సుందరీకరణ లక్ష్యంలో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. నిర్మాణ రంగంతోపాటు ఫార్మా, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హైదరాబాద్ ఎదిగింది. ఓఆర్ఆర్ వెలుపల కూడా నగరం భారీగా విస్తరిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 110 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్లో పడిన వర్షం నీరు 94 శాతం మూసీలోకే వెళ్తుంది’’ అని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్తో వార్పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్లో ఆడే అవకాశం!