Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: పునర్విభజన (డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్రం వినాలని మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని అన్నారు. పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికనీ, దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏమిటీ డీలిమిటేషన్?
జనాభా ప్రాతిపదికన..దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. -
అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శ
జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. -
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. -
మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
నెహ్రూను అవమానిస్తే పటేల్ను దూషించినట్టే
‘‘భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. -
న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలంటే లెక్కలేదా?
రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. -
పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థలో సమస్యలు
మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. -
ఓటమి భయంతోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత
బాపట్ల జిల్లా భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైకాపా వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ ధన దాహానికి రైతులు బలి: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధనదాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలకొందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్ బిధురి విచారం వ్యక్తం చేశారు. -
సుపరిపాలన భాజపాకే సాధ్యం
సుపరిపాలనను భాజపా మాత్రమే అందించగలదని దేశ ప్రజలు భావిస్తున్నందునే ఆ పార్టీ ప్రభుత్వాలకు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
విలీనం దిశగా.. మూడు విప్లవ పార్టీలు
మూడు విప్లవ పార్టీలు పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్లు త్వరలో ఉమ్మడి పార్టీగా విలీనమవుతున్నట్లు ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్ పోటు రంగారావు, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి హన్మేష్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?
గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది.