KTR: ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయి: కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు నేత, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యలు మరోసారి దిగ్భ్రాంతి కలిగించాయని మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించడం ఇదేం తొలిసారి కాదన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఈరోజు ప్రధాని చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
మోదీ.. తెలంగాణ విరోధి!
‘‘మోదీ.. తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకు? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం ఏం సంస్కారం? తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా?తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు? పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు? ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని
మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు?
ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా?
వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని మీ కేంద్రమంత్రి కించపరిచారు. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు! మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు. కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించండి. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలి? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా
దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలి?
మేం చేసిన పాపమేంది..?
కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా! పైన అప్పర్ భద్ర, కింద పోలవరం, ఇంకెక్కడో కెన్బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేంది? బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారు ఎందుకు? సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తారు. ఐటీఐఆర్ను రద్దు చేశారు. హైదరాబాద్కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే
ఆంక్షలు విధిస్తారు.
మీకు డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు
అడుగడుగునా దగా.. ప్రశ్నిస్తే పగ. జుమ్లా.. హమ్లా డబుల్ ఇంజన్ సర్కారు మీది! ఈడీ,ఐటీ, సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీకె.. పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రం. డబుల్ ఇంజన్ నినాదంతో ఊదరగొట్టే మీకు.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mukul Rohatgi: యడుయూరప్పకు ఒక ‘లా’.. చంద్రబాబుకు మరో ‘లా’
-
Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి రాజ్యసభలో చుక్కెదురు
-
ఆగ్రాలో డ్రైవర్ లేకుండా పరుగుతీసిన కంటెయినర్
-
రైలు ప్రమాదాల్లో పరిహారం పదిరెట్లు పెంపు
-
దర్యాప్తునకు భయపడి... ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు!
-
పోస్టుమార్టానికి తరలిస్తుండగా శరీరంలో కదలికలు