KTR: మహిళా బిల్లు పట్ల భారతీయుడిగా గర్వపడుతున్నా... కేటీఆర్‌

మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Updated : 19 Sep 2023 21:33 IST

హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు పట్ల ఓ భారతీయుడిగా గర్వపడుతున్నానన్నారు.ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. మహిళా బిల్లు కోసం తాము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశామని..  ఈ బిల్లు సాకారానికి తమవంతు కృషి చేయడం గర్వంగా ఉందన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా లేవనెత్తిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అందరూ కలిసిరావాలని కోరారు. మహిళా సాధికారత కోసం భారాస ఎన్నో చర్యలు చేపట్టిందన్న ఆయన.. చాలా ఏళ్ల క్రితమే స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు