Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు జేడీ(యు)నేత నీతీశ్ కుమార్ నిలబడలేరని భాజపా నేత సుశీల్ మోదీ పేర్కొన్నారు. భాజపాకు ‘మండల్’, ‘కమండల్’ రెండు వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు.
బిహార్ ముఖ్యమంత్రిపై భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ విమర్శ
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు జేడీ(యు)నేత నీతీశ్ కుమార్ నిలబడలేరని భాజపా నేత సుశీల్ మోదీ పేర్కొన్నారు. భాజపాకు ‘మండల్’, ‘కమండల్’ రెండు వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నీతీశ్ కుమార్ పేరు తరచుగా వినిబడుతోన్న వార్తలపై స్పందించిన సుశీల్ మోదీ.. అందుకు మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకులూ ఉన్నారని చెప్పుకొచ్చారు. జేడీ(యు) నేత తన సొంత రాష్ట్రంలోనే తన ప్రభావాన్ని కోల్పోతున్నారంటూ ఒకప్పుడు నీతీశ్ మంత్రివర్గంలో పనిచేసిన సుశీల్ మోదీ విమర్శించారు.
‘నీతీశ్ కుమార్ కంటే శక్తివంతమైన, ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతలు చాలా మంది ఉన్నారు. టీఎంసీ నేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్లకు ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు నిలబడే పరిస్థితి నీతీశ్కు లేదు. బిహార్ బయట ఆయన ప్రభావం ఏమీ ఉండదు. స్వరాష్ట్రంలోనూ ఆయనకున్న పాపులారిటీ క్రమంగా తగ్గిపోతోంది’ అని భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. భాజపాకు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందన్న విషయాన్ని నీతీశ్ కుమార్ తక్కువ అంచనా వేశారన్నారు.
ఇక భాజపాకు ఓబీసీలతో పాటు అన్నివర్గాల మద్దతు ఉందని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. నీతీశ్ కుమార్కు రాష్ట్రంలో రోజులు దగ్గరపడ్డాయని.. అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసినట్లు విమర్శించారు. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడంతో ఏదో ఒక కారణం చెప్పి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. -
సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. ఆదివారం ముంబయిలో జరిగిన రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా దిల్లీ చేరుకున్నారు. -
దానంపై అనర్హత వేటు వేయాలి
భారాస బీ ఫారంపై ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్న దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస డిమాండ్ చేసింది. -
కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ?
కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
అధర్మం, అవినీతి, అసత్య శక్తికి వ్యతిరేకంగా పోరాడాలనే చెప్పా
అధర్మం, అవినీతి, అసత్యాలతో కూడిన శక్తికి వ్యతిరేకంగా పోరాడాలనే తాను వ్యాఖ్యానించానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతేతప్ప ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడాలి’ అన్న తన మాటలు ఏ మతపరమైనవి కావని పేర్కొన్నారు. -
రాజకీయాల్లోకి లాలూ కుమార్తె రోహిణి!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్యను పార్టీ కంచుకోట అయిన సారణ్ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీలోని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
దాతల పేర్లను వెల్లడించలేం
ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన విరాళాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వీటితో ఏ పార్టీకి ఎంత మొత్తం దక్కిందనే సమాచారం బయటికొచ్చింది. -
ప్రధాని మోదీ వాట్సప్ సందేశాలపై విపక్షాల తీవ్ర అభ్యంతరం
వికసిత్ భారత్ నిర్మాణానికి మద్దతివ్వాలని కోరుతూ ప్రజలకు చేరిన ప్రధాని మోదీ వాట్సప్ సందేశాలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, వ్యక్తుల గోప్యత హక్కును ఉల్లంఘించే చర్యగా అభివర్ణించాయి. -
ఆయన శాసనసభ్యత్వం రద్దయినట్టే లెక్క
పార్టీ ఫిరాయింపులు ఎవరికీ మంచివి కావని భారాస సీనియర్ నేత బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు. -
దక్షిణాదిలోనూ అసాధారణ ఉత్సాహం
దక్షిణ భారతంలోనూ ఎన్డీయేకు అనుకూలంగా ప్రజల్లో అసాధారణ ఉత్సాహం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం తాను పర్యటించిన 3 రాష్ట్రాల్లో ప్రజలు సానుకూల వైఖరిని ప్రదర్శించారని వెల్లడించారు. -
రాష్ట్రానికి అండగా మోదీ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
ప్రధాని మోదీ రాష్ట్రానికి పదేళ్లు అండగా నిలబడ్డారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి తెలంగాణ సమాజానికి మరింత అభివృద్ధిని అందిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ఖాతాలోకి మంథని పురపాలిక
పెద్దపల్లి జిల్లాలోని మంథని పురపాలిక కాంగ్రెస్ వశమైంది. ఇక్కడ మొత్తం 13 వార్డులుండగా.. ఎన్నికల్లో 11 మంది భారాస నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. -
బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి
లోక్సభ ఎన్నికలకు బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం
వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి
అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవర్గాలో మార్పుచేర్పులు చేసినందున.. వాటిలో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. -
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
గత పదేళ్లలో భాజపా ఎంపీలు దిల్లీ నగరానికి ఏం చేశారో చెప్పాలని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. -
BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!
‘రెండు సీట్ల కోసం ఇంత కష్టపడాలా?’ అంటూ కర్ణాటకలో భాజపాతో ఎంపీ సీట్ల సర్దుబాటుపై జేడీఎస్ నేత కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.