Politics: దిగ్గజ నేతల కలయిక.. సీనియర్ మోస్ట్ సోషలిస్టు మిత్రుడిని కలిశానంటూ లాలూ ట్వీట్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్తో సోమవారం సమావేశమయ్యారు. సోమవారం జరిగిన.....
దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్తో సోమవారం సమావేశమయ్యారు. దిల్లీలో సోమవారం జరిగిన ఈ దిగ్గజాల భేటీలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను లాలూ ప్రసాద్ యాదవ్ తన ట్విటర్లో పంచుకున్నారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ సోషలిస్ట్ మిత్రుడైన ములాయంసింగ్ జీని కలిసినట్టు పేర్కొన్నారు. ఆయన బాగోగులను గురించి తెలుసుకున్నానని, ఉభయులూ కొన్ని అంశాలపై ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిపారు. రైతుల సమస్యలతో పాటు అసమానతలు, పేదరికం, నిరుద్యోగం తదితర అంశాలపై పోరాడే అంశంపై చర్చించినట్టు పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది ప్రజల సమానత్వం, సోషలిజం తప్ప క్యాపిటలిజం, మతతత్వం ( కమ్యునలిజం) కాదని ట్విటర్లో తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అఖిలేశ్ యాదవ్ కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్చేశారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ కురువృద్ధ నేతల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత