Politics: దిగ్గజ నేతల కలయిక.. సీనియర్‌ మోస్ట్‌ సోషలిస్టు మిత్రుడిని కలిశానంటూ లాలూ ట్వీట్‌

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌తో సోమవారం సమావేశమయ్యారు. సోమవారం జరిగిన.....

Updated : 02 Aug 2021 17:25 IST

దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌తో సోమవారం సమావేశమయ్యారు. దిల్లీలో సోమవారం జరిగిన ఈ దిగ్గజాల భేటీలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన ట్విటర్‌లో పంచుకున్నారు. దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ సోషలిస్ట్‌ మిత్రుడైన ములాయంసింగ్‌ జీని కలిసినట్టు పేర్కొన్నారు. ఆయన బాగోగులను గురించి తెలుసుకున్నానని, ఉభయులూ కొన్ని అంశాలపై ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిపారు. రైతుల సమస్యలతో పాటు అసమానతలు, పేదరికం, నిరుద్యోగం తదితర అంశాలపై పోరాడే అంశంపై చర్చించినట్టు పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది ప్రజల సమానత్వం, సోషలిజం తప్ప  క్యాపిటలిజం,  మతతత్వం ( కమ్యునలిజం) కాదని ట్విటర్‌లో తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అఖిలేశ్‌ యాదవ్‌ కూడా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌చేశారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ కురువృద్ధ నేతల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని