Kuppam: చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు.. శాంతిపురంలో తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్‌

చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. శాంతిపురం మండలం ఎస్‌.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 04 Jan 2023 15:13 IST

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. శాంతిపురం మండలం ఎస్‌.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నేతలు శాంతిపురం చేరుకుంటున్నారు.

అయితే ఎక్కడికక్కడ పోలీసులు తమ ఆంక్షలతో వారిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌.గొల్లపల్లి వద్ద కూడా ఇలాగే అడ్డుకోవడంతో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌, తోపులాటలో తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ స్పృహ తప్పి కిందపడియారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని