కేంద్రం అహంకార ధోరణి వీడాలి: సోనియా
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. కేంద్రం తక్షణమే స్పందించి మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.
దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. కేంద్రం తక్షణమే స్పందించి మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతుల సమస్యల పట్ల ఇలా అహంకారపూరితంగా వ్యవహరించిన తొలి ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. ఈ మేరకు సోనియా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
‘‘మోదీ ప్రభుత్వం తమ అహంకారపూరిత ధోరణి వీడాలి. మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకొని.. రైతుల ఆందోళనలకు ముగింపు పలకాలి. ప్రజాస్వామ్యం అంటే పేదలు, రైతులు, కూలీల ప్రయోజనాలను కాపాడటమే అనే విషయాన్ని మోదీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల పరిస్థితి చూసి దేశంతో పాటు నేను సైతం ఎంతో చలించిపోయా. ఎముకలు కొరికే చలిలో వారు చేస్తున్న నిరసనలు ఎంతో బాధిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించడం లేదు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు సోదరులకు ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఆదాయం కట్టబెట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది’’ అంటూ సోనియా విమర్శించారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్