Ts News: కౌశిక్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు

కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని.. మాణికం...

Published : 13 Jul 2021 17:49 IST

హైదరాబాద్: కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని.. మాణికం ఠాగూర్‌ డబ్బులు తీసుకొని సీనియర్లను కాదని రేవంత్‌కు పీసీసీ కట్టబెట్టారని కౌశిక్‌రెడ్డి నిన్న జరిగిన మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిరాధార ఆరోపణలు.. తన పరువుకు తీవ్ర భంగం కలిగించాయని మాణికం ఠాగూర్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి పారదర్శకంగా అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగిందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రాతపూర్వకంగా బేషరతుగా కౌశిక్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని.. రూ.కోటి పరువు నష్టం దావా వేయనున్నట్లు ఠాగూర్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని