fuel hike: పెట్రోల్‌ కన్నా లిక్కరే చౌక!

దేశంలో ఇంధన ధరలు పెరగడంపై కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా హయాంలో పెట్రోల్‌, డీజిల్‌......

Published : 16 Jul 2021 01:37 IST

మహరాష్ట్ర మాజీ సీఎం విమర్శలు

నాందేడ్‌: దేశంలో ఇంధన ధరలు పెరగడంపై కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా హయాంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల కన్నా మద్యం ధరే చౌకగా మారిందన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై నాందేడ్‌లోని కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చవాన్‌ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ హయాంలో రూపాయి లేదా రెండు రూపాయలు పెంచితే విపక్షాలు నిరసనలకు దిగేవన్నారు. ఈ రోజు భాజపా అధికారంలోకి వచ్చాక లీటరు పెట్రోల్‌ రూ.100 దాటేసిందని, ఎల్పీజీ సిలిండర్‌ ధర మూడు రెట్లు పెరిగిందని మండిపడ్డారు. ఆ పెరుగుదలతో నిత్యావసర వస్తువులతో పాటు రవాణా ఖర్చులు సైతం పెరిగిపోతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని