Andhra News: మంత్రి పెద్దిరెడ్డి మాటలు విని నివ్వెరపోయా: లోకేశ్‌

మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్‌గా చెప్పడం నివ్వెరపోయేలా చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Published : 12 May 2022 02:02 IST

అమరావతి: మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్‌గా చెప్పడం నివ్వెరపోయేలా చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెదేపా నేతలపై కక్ష సాధించేందుకు వైకాపా ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు వైకాపా ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన ఓ వీడియోను లోకేశ్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని