Telangana News: రేవంత్.. మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం: మధుయాష్కీ
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని..
హైదరాబాద్: రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని.. పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మధుయాష్కీ.. రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
‘‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్ని వర్గాల కలయికే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వ్యక్తి కంటే వ్యవస్థ, పార్టీ ముఖ్యం. గతంలో రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నేతలను సైతం ఇందిరా గాంధీ అక్కున చేర్చుకున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి, నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చొరవ వల్లే ఈ పదవులు దక్కాయి. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతిలో బలహీన వర్గాలు బలవుతున్న విషయాన్ని గ్రహించిన సోనియా గాంధీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆయా వర్గాలను మోసం చేశారు.
వరంగల్ డిక్లరేషన్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడి ఉంటే పీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉంటే.. ఎందుకు పార్టీ ఓటమి పాలైంది?బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనార్టీ వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’’ అని మధుయాష్కీ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత