Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ శిందే..
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో మెజార్టీ మార్క్(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష (Trust Vote)లో మెజార్టీ మార్క్(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా ఓటేశారు. దీంతో బలపరీక్షలో సీఎం నెగ్గినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.
ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే భాజపా, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ ఓటు ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేశారు. అయితే డివిజన్ ఆఫ్ ఓట్ పద్ధతిలో బలపరీక్ష చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఇందుకు అంగీకరించిన సభాపతి.. డివిజన్ ఆఫ్ ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. శిందేకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు లేచి నిలబడగా.. అసెంబ్లీ సిబ్బంది లెక్కింపు చేశారు. శిందేకు మద్దతుగా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 99 మంది వ్యతిరేకంగా ఓటెయ్యగా.. ముగ్గురు ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
బలపరీక్షకు ముందు శిందే గూటికి మరో ఎమ్మెల్యే..
కాగా.. విశ్వాస పరీక్షకు కొద్ది సేపటి ముందు ఠాక్రే వర్గానికి మరో షాక్ తగిలింది. మరో శివసేన ఎమ్మెల్యే ఒకరు శిందే వర్గంలో చేరారు. హింగోలీ జిల్లా కలమ్నూరి నియోజకవర్గ ఎమ్మెల్యే సంతోష్ బంగర్ శిందే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం విశ్వాస పరీక్షలోనూ సంతోష్.. శిందేకు అనుకూలంగా ఓటేశారు.
ప్రతిపక్షాల ‘ఈడీ’ నినాదాలు..
విశ్వాస పరీక్షలో సంతోష్.. శిందేకు మద్దతుగా నిలబడగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ‘ఈడీ.. ఈడీ’ అంటూ నినాదాలు చేశారు. శిందే వర్గానికి చెందిన ప్రతాప్ సర్నాయక్ ఓటేసినప్పుడు కూడా ఇలాంటి నినాదాలే చేశారు. ఈడీ దర్యాప్తులకు భయపడే శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు ఠాక్రే వర్గం మొదట్నుంచీ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతాప్ సర్నాయక్ కూడా ఓ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.
మరోసారి సుప్రీంకోర్టుకు ఠాక్రే వర్గం..
ఇదిలా ఉండగా.. మహా అసెంబ్లీ నూతన సభాపతి నర్వేకర్ నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన సభాపక్ష నేతగా ఉన్న అజయ్ ఛౌదరిని తొలగించి.. ఆయన స్థానంలో సీఎం ఏక్నాథ్ శిందేను తిరిగి నియమించారు. చీఫ్ విప్ పదవిలోనూ శిందే వర్గ ఎమ్మెల్యేను నియమించారు. అయితే చీఫ్ విప్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిసి ఈ పిటిషన్ను కూడా జులై 11వ తేదీనే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Prathipati Pulla rao: సభ విఫలం చేయాలని కుట్రలు చేశారు: ప్రత్తిపాటి
బొప్పూడిలో జరిగిన ‘ప్రజాగళం’ ఎన్డీయే కూటమి సభ అంచనాలకు మించి విజయవంతమైందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. -
PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్
PM Modi: ‘శక్తి’ని నిర్వీర్యం చేస్తామంటూ విపక్ష కూటమి తమ మేనిఫెస్టోలో చెబుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. శక్తిని ఆరాధించేవారికి, నాశనం చేయాలనుకునేవారి మధ్యే ఈ పోరాటం అని అన్నారు. -
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను కలిసింది. -
Atchannaidu: ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు
ప్రభుత్వ శాఖల వైబ్సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. -
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. -
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న కూటమి నేతలు
ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయనిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని తెదేపా, జనసేన, భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. -
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి
తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీయే విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ మొదలుపెడుతున్నాం. అంతకుమించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
‘వికసిత భారత్ కోసం ఇదే సమయం. సరైన సమయం’ అనేది నరేంద్రమోదీ నినాదం. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి సరైన నాయకుడు దొరికారు. ఆ దిశగా మీ ప్రతి ప్రయత్నంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం. -
‘ప్రజాగళం’ సభలో ఎవరేమన్నారంటే..
అయిదేళ్లుగా సీఎం జగన్ మీద, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 56 రోజుల కౌంట్డౌన్ మొదలైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నారు. -
జగన్ మీ దత్తపుత్రుడు కాదా?
ముఖ్యమంత్రి జగన్తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. -
అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
బహుజనులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేసే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి తెలిపారు. -
అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి
భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. -
మిగతా అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్ కసరత్తు
లోక్సభ ఎన్నికల్లో ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దానంపై ఫిర్యాదుకు స్పీకర్ ఇంటికి భారాస ఎమ్మెల్యేలు..
భారాస పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం అందజేయాలని భారాస ఎమ్మెల్యేలు నిర్ణయించారు. -
సీఎం రేవంత్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: దాసోజు శ్రవణ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భారాస నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. -
తెలంగాణకు భాజపా ఏం చేసిందని ఓట్లేయాలి?
గత పదేళ్లలో తెలంగాణకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్రెడ్డి చెప్పాలని, ప్రజలు ఎందుకు ఓట్లేయాలని భారాస నేత రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
Pakistan: పొరుగు దేశంపై పాక్ వైమానిక దాడి.. ఎనిమిది మంది మృతి
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
-
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
-
Ashwin: బెన్స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: రవిచంద్రన్ అశ్విన్