కేసీఆర్ జీ.. మీరు గొప్పగా పోరాడుతున్నారు: తెలంగాణ సీఎంకు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశం..
హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్కు ఆయన ఫోన్ చేశారు. ముంబయి రావాలని.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు.
‘‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం" అని కేసీఆర్తో ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్లో ఎలా కలిసి ముందుకెళ్లాలనే అంశాలపై వీరిద్దరూ ఆ భేటీలో చర్చించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..