Maharashtra crisis: గర్జించని పులి ఉద్ధవ్.. ‘సాఫ్ట్’ వైఖరే కొంపముంచిందా?
Maharashtra crisis explaned in telugu: మృదుస్వభావిగా పేరొందిన శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే (uddhav thackeray) పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: పెద్దపులి ఎప్పుడూ గర్జించాలి. అదే దానికి ప్రత్యేకతను, వీరత్వాన్ని, ధీరత్వాన్ని ఇస్తుంది. రాజకీయాల్లోనూ నేతలు అలాగే ఉండాలి. ఒకపార్టీని నడుపుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా పార్టీశ్రేణులపై పూర్తి పట్టు కలిగి ఉండాలి. ఏ మాత్రం పట్టుజారినా మొదటికే మోసం వస్తుంది. ఇది అక్షరాల మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామం. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందిన శివసేన (Shivsena) నిలువునా చీలిపోయే పరిస్థితులకు చేరుకుంది. మృదుస్వభావిగా పేరొందిన శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (uddhav thackeray) పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. సేన ప్రస్తుత పరిస్థితికి కారణాలను పరిశీలిస్తే..
హిందుత్వ నుంచి మళ్లడం..
బాలాసాహెబ్గా పిలుచుకునే బాల్ఠాక్రే భూమిపుత్రుల నినాదంతో శివసేనను నెలకొల్పారు. అనంతరం కొన్ని సంవత్సరాలకు హిందుత్వబాట పట్టింది. ముంబయి, ఠానే, పాల్ఘార్, కొంకణ్, మరఠ్వాడా ప్రాంతాలో బలంగా విస్తరించింది. భాజపాతో సన్నిహిత సంబంధాలు పార్టీని ముందుకు నడిపించాయి. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-భాజపా కూటమి అధికారం అందుకుంది. అనంతరం హిందుత్వకు సంరక్షణ పార్టీగా సేన పేరొందింది. ఒక దశలో బాల్ఠాక్రేను హిందు హృదయ సామ్రాట్ అని ప్రేమతో పిలిచేవారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే భాజపాతో కలిసి పోటీచేసినా సీఎం పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో రాష్ట్రంలో శివసైనికులు నిర్ఘాంత పోయారు. దాదాపు మూడు దశాబ్దాలు తాము ఎవరితో పోరాడామో వారితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇందులో ఏక్నాథ్శిందే ఒకరు.
పులి గర్జించలేదు..
బాల్ఠాక్రే ఉన్న సమయంలో ఆయన మాటలు తూటాల తరహాలో దూసుకువచ్చేవి. ఒక ప్రకటన చేసిన తరవాత వెనక్కు తిరగడమన్నది జరగలేదు. అయితే ఉద్ధవ్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అయినా శివసేన సహజమైన దూకుడు వైఖరి లేకపోవడం ఒక మైనస్. ఆయన కుమారుడు యువనేత ఆదిత్య రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా పాఠాలు నేర్వలేదు. దీంతో అనేకమంది కార్యకర్తలు భాజపా లేదా ఇతర కాషాయ పార్టీలవైపు వెళ్లారు.
ఉద్యమ నేత.. ఏక్నాథ్
సీఎంగా ఉద్ధవ్ పగ్గాలు చేపట్టకపోయింటే ఏక్నాథ్ సీఎం అయ్యేవారు. అయితే ఉద్ధవ్ స్వయంగా సీఎం కావడంతో అయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఠానే, పాల్ఘార్ జిల్లాల్లో ఏక్నాథ్ తిరుగులేని నేత. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించడంలో ఆయనదే కీలకపాత్ర. సమయం కోసం వేచిచూస్తున్న ఆయనకు ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలు తోడవటం, భాజపాతో సంబంధాలతో తిరుగుబాటు నేతగా ఆవిర్భవించారు. గతంలోనూ సేన నుంచి చగన్ భుజ్బల్, నారాయణ్రాణే వంటి సీనియర్ నేతలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారి.
కూటమిలో ఇమడలేక
మహారాష్ట్ర వికాస్ అఘాఢీ కూటమి ఎన్నికలకు పూర్వం ఉన్నటువంటి కూటమి కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటయింది. శివసేన మంత్రులకు ఏ పనిచేయాలన్న సీఎం కార్యాలయం నుంచి తుది ఆదేశాలు రావాల్సిందే. మరో వైపు ఎన్సీపీనేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మితిమీరిన జోక్యం కూడా అసమ్మతికి దోహదపడింది. తమ నియోజకవర్గాల్లో నిధులు సైతం తగ్గిస్తున్నారని వారు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ పరిణామాలు మింగుడుపడని పలువురు శివసేన ఎమ్మెల్యేలు శిందే శిబిరంలో చేరి తిరుగుబాటు జెండా ఎగరవేశారు.
‘మహా’ Updates..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. -
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం