Congress: రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే..!..కాంగ్రెస్ మాట తప్పనుందా?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఖర్గే స్థానంలో ప్రతిపక్ష నాయకుడిగా చిదంబరాన్ని ఎంపిక చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
దిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. పార్టీ అగ్రనేత చెప్పిన ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి గండి పడినట్లవుతుంది. డిసెంబరు 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఎవరిని కొనసాగిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం వ్యూహాత్మక కమిటీ భేటీకి పిలుపునిచ్చినట్లు సమాచారం. కేవలం మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్కు మాత్రమే ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీనియారిటీ పరంగా ఖర్గే స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యమున్న పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్కు ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది.
‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధన మేరకు ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు. అయితే, కనీసం శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకైనా ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం ఉందని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. కేవలం ఖర్గేనే కాకుండా పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతలకు రెండేసి పదవులున్నాయి. లోక్సభలో ప్రతిపక్షనేతగా ఉన్న అధిర్రంజన్ చౌదురి.. పశ్చిమ్ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు సీనియర్ నేత జైరాం రమేశ్ రాజ్యసభలో చీఫ్ విప్గానూ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిని కూడా ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం చేయాలన్న వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వైదొలగడానికి ప్రధాన కారణం ఇదే.
అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిపేందుకు తొలుత గాంధీ కుటుంబం అశోక్ గహ్లోత్నే ఎంపిక చేసింది. అయితే, పార్టీ నియమాల ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేస్తే.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సచిన్ పైలట్ వర్గీయులు డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో.. అశోక్ గహ్లోత్ అధ్యక్ష రేసు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకి వచ్చింది. అయితే, తాజాగా ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కొనసాగిస్తే.. పార్టీలో మళ్లీ విభేదాలు తలెత్తే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
సమావేశానికి వాళ్లు కూడా..
మరోవైపు అగ్రనేత్రి సోనియాగాంధీతో జరగనున్న వ్యూహాత్మక కమిటీ సమావేశానికి లోక్సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదురి, రాజ్యసభ చీఫ్ విప్ జైరాం రమేశ్, లోక్సభలో చీఫ్ విప్ కె.సురేశ్ కూడా హాజరవుతారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రులు పి. చిదంబరం, మనీశ్ తివారీ కూడా హజరయ్య అవకాశమున్నట్లు చెప్పింది. ఖర్గే కొనసాగింపు అంశంపై విభిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా చిదంబరాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు. -
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
లోక్సభ ఎన్నికల్లో అనంత్నాగ్- రాజౌరి సీటు నుంచి కేంద్ర మాజీమంత్రి ఆజాద్ పోటీ చేయట్లేదని ఆయన స్థాపించిన డీపీఏపీ పార్టీ ప్రకటించింది. -
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్ .. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్
మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. -
పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. -
కేసీఆర్, రేవంత్ డూప్ ఫైట్ చేస్తున్నారు: లక్ష్మణ్
హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. -
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి గెలిపిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్ రాణా
భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) ఎన్నికల ప్రచార వీడియో వైరల్ కావడంతో.. విపక్షాలు ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. -
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చింది. బుధవారం రామనవమిని పురస్కరించుకొని ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ఆప్ ప్రారంభించింది. -
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు భాజపా తుడిచిపెట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం పేర్కొన్నారు. -
ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్లు అందజేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. -
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. -
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. -
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్