Congress: మునుగోడు ఓటమితో కాంగ్రెస్ పనైపోయిందనుకుంటే పొరపాటే: మల్లు రవి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకతాటిపై నడిచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేశారని పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసేది తామేనని, అధికారంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ప్రభుత్వంతో కొట్లాడుతున్నామన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకతాటిపై నడిచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేశారని పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసేది తామేనని, అధికారంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ప్రభుత్వంతో కొట్లాడుతున్నామన్నారు. భాజపా, తెరాస విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదిరించి పోరాడుతోందని పేర్కొన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడారు.
దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చేందుకే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచినంత మాత్రాన పార్టీ పనైపోయిందనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. మునుగోడులో ప్రజాస్వామ్యయుత ఎన్నికలు జరగకపోవడం వల్లనే కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులను అడ్డగోలుగా కొనుగోలు చేశారని.. తెరాస, భాజపా కలిసి డబ్బుతో మాయ చేశాయని విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్