ఉప ఎన్నిలకు TMC అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు
పశ్చిమ బెంగాల్లో వచ్చే నెల జరగబోయే ఉప ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే నెల జరగబోయే ఉప ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అసన్సోల్ లోక్సభ నియోజకవర్గానికి సీనియర్ నేత శత్రుఘ్న సిన్హాను, బాలీగుంగే అసెంబ్లీ స్థానానికి బాబుల్ సుప్రియో పేర్లను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. వీరిద్దరూ గతంలో భాజపా నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన వారే కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం ప్రకటన వెలువరించింది. దీంతో మమతా బెనర్జీ అభ్యర్థులను ఖరారు చేశారు. బాబుల్ సుప్రియో రాజీనామాతో ఖాళీ ఏర్పడిన అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హాను బరిలో నిలుపుతున్నట్లు మమత ప్రకటించారు. అలాగే, రాష్ట్ర మంత్రి సుభత్రా ముఖర్జీ మరణంతో ఖాళీ ఏర్పడిన స్థానానికి బాబుల్ సుప్రియో పేరును మమత ఖరారు చేశారు. శత్రుఘ్న సిన్హా గతంలో భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అనంతరం తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు బాబుల్ సుప్రియో భాజపాను వీడి టీఎంసీ కండువా కప్పుకొన్నారు.
వడ్డీ తగ్గింపు.. రిటర్న్ గిఫ్టా: మమత
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో విజయం కట్టబెట్టినందుకు రిటర్న్ గిఫ్టా అని ప్రశ్నించారు. దీన్ని ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వడ్డీ రేట్లు తగ్గించి భాజపా తన ముసుగును బయటపెట్టిందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..