Mamata Banerjee: దుర్గామాతగా మమత విగ్రహాలు.. భాజపా ఫైర్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాలను ప్రతిష్ఠించాలని కొందరు నిర్వాహకులు నిర్ణయించడం వివాదానికి తావిచ్చింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ప్రతిపక్ష భాజపా మండిపడుతోంది.
నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠించేందుకు ప్రముఖ శిల్పి మింటు పాల్ మమత విగ్రహాలను రూపొందిస్తున్నారు. మమత ఆహార్యానికి దగ్గర ఉండేలా తెలుపు రంగు చీరతో కూడిన విగ్రహాన్ని తయారుచేస్తున్న చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. దుర్గామాత ప్రతిరూపంగా ఆమెకు పది చేతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయుధాలకు బదులుగా ప్రజాదరణ పొందిన పథకాలను ప్రతిబింబించేలా విగ్రహాలను రూపొందిస్తున్నారు. మమత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రజలకు మరింత తెలియజేయాలనే లక్ష్యంతో తాను ఈ విగ్రహాలను రూపొందిస్తున్నానని, ఇందుకోసం ఆమె ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పుకొచ్చారాయన.
విగ్రహాల ప్రతిష్ఠించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్ష భాజపా ఖండించింది. ఎన్నికల అనంతరం హింసకు పాల్పడుతున్న వ్యక్తిని దేవతగా చిత్రీకరించడాన్ని తప్పుబట్టింది. దుర్గామాతను, హిందువుల మనోభావాలను అవమానించడమేనని ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాళవీయ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించకపోవడమంటే విగ్రహ ఏర్పాటుకు మమత అంగీకరిస్తున్నట్లేనని, దీనిబట్టి దీదీ అహం తారస్థాయికి చేరుకుందనేది అర్థమవుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
-
India News
Tamilnadu: తమిళనాడు మంత్రి కారుపై చెప్పు విసిరిన ఘటన.. భాజపా కార్యకర్తల అరెస్ట్
-
World News
Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
-
Sports News
MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో మెంటార్గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో మెంటార్గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం.. 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య