..అలాగే వంటగ్యాస్ ధరలూ తగ్గించండి: మేనకా గాంధీ
దేశంలో మండిపోతున్న పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, సుల్తాన్పూర్ భాజపా ఎంపీ మేనకా......
సుల్తాన్పూర్: దేశంలో మండిపోతున్న పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, సుల్తాన్పూర్ భాజపా ఎంపీ మేనకా గాంధీ స్వాగతించారు. అదే మాదిరిగా వంటగ్యాస్ సిలిండర్ ధరలనూ తగ్గించాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి ఏశారు. యూపీలోని తన లోక్సభ నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆమె సుల్తాన్పూర్లో మాట్లాడారు. పెట్రో ధరల్ని కేంద్రం తగ్గించింది.. అలాగే వంటగ్యాస్తో పాటు ఇతర వస్తువుల ధరలనూ తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వంటగ్యాస్ ధరల తగ్గింపుపై కూడానిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా సభ్యుల్ని చేర్పిస్తుంటానని గుర్తుచేశారు. జిల్లా పంచాయతీ ఎన్నికల ఎన్నికల్లో మనమే గెలవాల్సిందన్నారు. గతంలో భాజపాకు లక్షలాది మంది పార్టీ సభ్యులు ఉండేవారు.. కానీ జిల్లా పరిషత్లో ఒక్క స్థానమూ రాలేదన్నారు. కేవలం భాజపా ఆఫీస్ బేరర్లు ఓటు వేసినా గెలిచేవాళ్లమనీ.. బూత్ ప్రెసిడెంట్, అతడి కుటుంబం, బంధువులు ఓటేసినా గెలిచేవాళ్లమంటూ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్