Mayawati: రాహుల్జీ.. ముందు సొంతింటిని చక్కబెట్టుకోండి: మాయావతి
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పంపితే దానిపై తాను కనీసం మాట్లాడలేదన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తిప్పికొట్టారు. ‘‘సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని రాహుల్ బీఎస్పీపై విమర్శలు చేస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. గాంధీ వ్యాఖ్యలన్నీ అబద్ధాలన్నారు. ముగిసిన ఎన్నికల గురించి కాకుండా ఓటమికి గల కారణాలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
భారత్లో చైనా తరహాలో ఏకపార్టీ...
‘‘భాజపా, ఆరెస్సెస్ కలిసి భారత్ను కాంగ్రెస్ రహిత దేశంగానేగాక ప్రతిపక్ష రహితంగా మార్చేందుకు యత్నిస్తున్నాయి. చివరకు భారత్లో చైనా తరహాలో ఒకే ప్రధాన పార్టీ మనుగడలో ఉంటుంది. పార్లమెంటులో ప్రధానిని కౌగిలించుకునే రాహుల్ గాంధీ వంటి నేతలు ఉన్న పార్టీ కాదు మాది. ప్రపంచవ్యాప్తంగా అబాసుపాలవుతున్న పార్టీ కాదు మాది’’ అని ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ, పెగాసస్కు భయపడుతున్నారన్న వ్యాఖ్యలనూ మాయావతి తిప్పికొట్టారు. ‘‘గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం ఇదే తరహాలో బీఎస్పీని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నించారు. దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నామని ప్రియాంక గాంధీ సైతం ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిజం కాదు. వీటన్నింటిపై సుప్రీంకోర్టులో పోరాడి గెలిచాం అని వారు తెలుసుకోవాలి’’ అని మాయావతి అన్నారు.
ఇవీ రాహుల్ వ్యాఖ్యలు..
దేశంలోని రాజకీయ వ్యవస్థలను సీబీఐ, ఈడీ, పెగాసస్లతో నియంత్రిస్తున్నారంటూ శనివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రంపై రాహుల్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినాయకురాలు మాయావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తామని తమ పార్టీ తరఫున ప్రతిపాదన పంపామని వెల్లడించారు. కలిసి పోటీ చేద్దామని సందేశం పంపితే ఆమె మాట్లాడలేదని అన్నారు. దీనికి కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్లేనని తెలిపారు. వీటికి భయపడే ఆమె తమ ప్రతిపాదనకు స్పందించలేదన్నారు.
ఇరు పార్టీలకూ ఘోర పరాభవం..
ఇటీవల ముగిసిన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 2017 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత ఈసారి సమాజ్వాదీ పార్టీ.. కాంగ్రెస్తో పొత్తుకు వెనుకాడింది. పైగా చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇది ఎస్పీకి లాభం చేకూర్చింది. చివరకు భాజపా విజయం సాధించినప్పటికీ.. ఎస్పీ రాణించడంలో కాంగ్రెస్ ఓట్లు బదిలీ కావడమే ముఖ్య కారణంగా రాజకీయ పండితులు ఫలితాలను విశ్లేషించారు. మొత్తం 403 స్థానాలకుగానూ కేవలం రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కేవలం 2.5 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్కు పడడం గమనార్హం. 97 శాతం సీట్లలో అభ్యర్థులకు ధరావతు కూడా దక్కలేదు. బీఎస్పీ సైతం భారీ ఓటమిని చవిచూసింది. కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. 12 శాతం ఓట్లను సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: కొనసాగుతోన్న హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
-
Movies News
Rajeev Kanakala: ‘లవ్స్టోరీ’లో బాబాయ్ పాత్ర.. ఇబ్బంది పడ్డా! : రాజీవ్ కనకాల
-
Ap-top-news News
Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస