
Mamata banerjee: తృణమూల్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా దీదీ
దిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయెన్ దిల్లీలో మీడియాకు వెల్లడించారు. చాలా కాలంగా టీఎంసీ పార్లమెంటరీ పార్టీ వెనుక ఉండి ఆమె మార్గదర్శనం చేస్తూ ఉన్నారన్నారు. ఆ వాస్తవికతనే అధికారికంగా ప్రకటిస్తున్నామని, తమ ఛైర్పర్సన్ ఏడు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా కూడా ఉన్నారని ఓబ్రెయెన్ గుర్తు చేశారు. పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉన్నందునే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, మమతా బెనర్జీ పార్లమెంట్ సభ్యురాలు కాకపోవడం గమనార్హం.
మరోవైపు, భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని దీదీ ఇటీవల వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించి పార్టీకి హ్యాట్రిక్ విజయం సాధించిన దీదీ వైపు విపక్షాలు చూస్తున్నాయని, ఆమె జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారంటూ వార్తలు వస్తున్న వేళ ఈ కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారంలో ఆమె దిల్లీ పర్యటనలో అనేకమంది విపక్ష పార్టీల నేతలు దీదీతో సమావేశం కావాలనుకుంటున్నారని కూడా డెరెక్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
-
Politics News
బిహార్లో మజ్లిస్కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్!
-
Politics News
Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Movies News
Pakka Commercial: కామెడీ- యాక్షన్ ప్యాకేజీగా ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ ట్రైలర్..!
-
Politics News
Maharashtra Crisis: సుప్రీం కోర్టులో ఉద్ధవ్కు షాక్.. రేపే బలపరీక్ష
-
Business News
బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్ను ఉమ్రాన్కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- Hema Chandra - Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)