Ambati Rambabu: పోలవరం డయాఫ్రం వాల్పై చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు అంబటి సవాల్
పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన డయా ఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై చర్చకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమలకు ఆయన సవాల్ విసిరారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు సాగునీటిని మంత్రి ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం డయా ఫ్రం వాల్పై పలు అంశాలను ప్రస్తావించారు.
‘‘ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో డయాఫ్రం వాల్పై చర్చ జరగాలి. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతింది. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదం. డయా ఫ్రం వాల్కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్న అంశంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే పూర్తవుతుంది. మొదటి దశ పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ప్రాజెక్ట్ పూర్తికి గడువు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. అనుకున్న విధంగానే జూన్ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలతో నారుమళ్లు వేసుకోవడానికి రైతులకు వీలుగా ఉంటుందని అంబటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్, గీత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్