సంతబొమ్మాళి ఘటనలో కుట్రకోణం: సీదిరి
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచిపేరు రాకూడదనే పథకాలు ప్రారంభించే ముందు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నంది విగ్రహం..
అమరావతి: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచిపేరు రాకూడదనే పథకాలు ప్రారంభించే ముందు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించిన ఘటనలో తెదేపా ప్రమేయం ఉందన్నారు. ఇంటివద్దకే నిత్యావసరాల కార్యక్రమాన్ని రేపు సీఎం జగన్ ప్రారంభిస్తు్న్నారని.. దీన్ని పక్కదారి పట్టించేందుకు విగ్రహాల ధ్వంసం కార్యక్రమానికి ప్రణాళిక వేశారని ఆక్షేపించారు.
సంతబొమ్మాళి ఘటనలో సుస్పష్టంగా కుట్రకోణం ఉందని.. తెదేపా కనుసన్నల్లోనే విగ్రహాల ధ్వంసం కార్యక్రమం జరుగుతోందని అప్పలరాజు ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా వారిని ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారన్నారు. సంతబొమ్మాళి ఘటనపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ