Errabelli Dayakar Rao: చేనేతపై జీఎస్‌టీ రద్దు చేయాలి.. కేంద్రానికి ఎర్రబెల్లి పోస్టుకార్డు

చేనేత వస్త్రాలపై విధించిన 5శాతం జీఎస్‌టీ రద్దు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా ఆయన కేంద్రానికి లేఖ రాశారు.

Published : 25 Oct 2022 02:38 IST

హైదరాబాద్‌: చేనేత వస్త్రాలపై విధించిన 5శాతం జీఎస్‌టీ రద్దు చేయాలంటూ తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా ఆయన ఈ లేఖను రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే కేంద్రం మాత్రం వారి నడ్డి విరిచేలా జీఎస్‌టీ విధించడం అన్యాయమని లేఖలో వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడిన చేనేత రంగానికి తగిన సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత రంగంపై జీఎస్‌టీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు.eeeee

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని