ఎస్‌ఈసీ ఆదేశాలపై కొడాలి హౌస్‌మోషన్‌ పిటిషన్‌

మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 14 Feb 2021 20:25 IST

అమరావతి: మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు గంటన్నర పాటు ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులను సమర్పించాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికల కమిషర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు.

ఇవీ చదవండి..

‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

హైదరాబాద్‌ చేరుకున్న అరకు ప్రమాద మృతులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు