‘పవన్కు రాజకీయాలపై అవగాహన లేదు’
జనసేన అధినేత పవన్కల్యాణ్కు రాజకీయాలపై అవగాహన లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. హిందుత్వంపై భాజపాకు నిజమైన గౌరవం ఉంటే అంతర్వేది సహా పలు ఘటనపై సీబీఐ దర్యాప్తు ..
ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు
గుడివాడ: జనసేన అధినేత పవన్కల్యాణ్కు రాజకీయాలపై అవగాహన లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. హిందుత్వంపై భాజపాకు నిజమైన గౌరవం ఉంటే అంతర్వేది సహా పలు ఘటనలపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదని నిలదీశారు. కృష్ణా జిల్లా నందివాడలో తెదేపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాసరి మేరీ విజయకుమారి మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ పవన్పై విమర్శలు గుప్పించారు.
పవన్కు సినిమాలు తప్ప రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు గతంలో జగన్, అతడికి సంబంధించిన వ్యక్తులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. సీబీఐ పరిధిలో ఉన్న కేసును ఎవరు దర్యాప్తు చేయాలని ప్రశ్నించారు. తిరుపతిలో ఎన్నికల ప్రచార వేదికపై పవన్ ఆరోపణలు చేసింది తమపై కాదని.. భాజపాను ఉద్దేశించేనన్నారు. ‘‘భాజపాకు దేవుళ్లు, గుడులపై నమ్మకముంటే అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ఈ విషయంలో సీబీఐ విచారణ వేసి నిందితులను పట్టుకోవాలని కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కొడాలి నాని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్