Kodali Nani: మాకు ఆ రెండు సినిమాలు ఎంతో.. ‘భీమ్లానాయక్’ అంతే..: కొడాలి నాని
శత్రువులు, మిత్రుల గురించి కాకుండా ప్రజల గురించే సీఎం జగన్ ఆలోచిస్తారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు ఎంతోకొంత మేలు..
అమరావతి: శత్రువులు, మిత్రుల గురించి కాకుండా ప్రజల గురించే సీఎం జగన్ ఆలోచిస్తారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే దిశగానే ఆయన పనిచేస్తుంటారని చెప్పారు. సినిమాలన్నింటికీ ఒకే రకమైన షరతులు ఉంటాయన్నారు. తమకు ‘అఖండ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఎంతో.. ‘భీమ్లా నాయక్’ కూడా అంతేనని స్పష్టం చేశారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో జరుగుతున్న చర్చ, సినిమా పెద్దలతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశంపై వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు.
ఆ విషయాలన్నీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు తెలుసు కానీ..
‘‘ఇప్పుడు పవన్కల్యాణ్పై తెదేపా నేతలు విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ను సీఎం జగన్ తొక్కేశారని.. పవన్పై జగన్ యుద్ధం అంటూ ఏదో జరిగిపోయిందనేలా ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 25న జీవో ఇస్తామని.. సినిమా టికెట్ రేట్లు పెంచుకోమని తమ ప్రభుత్వం, పార్టీ ఎక్కడా చెప్పలేదు. ఇటీవల సీఎంను సినీ పెద్దలు కలిశారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి.. పాన్ ఇండియా సినిమాలకు రేట్లు ఎలా ఉండాలి? తదితర అంశాలపై చర్చ జరిగింది. టికెట్ల ధరలపై కోర్టు నియమించిన కమిటీ, ప్రభుత్వం, సినీ పెద్దల అభిప్రాయం.. ఇలా మూడింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నిర్ణయంపై న్యాయ సలహా కోరి వారి అభిప్రాయం తీసుకోవాలి. న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేకుండా జీవో ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈలోపు మంత్రి గౌతమ్రెడ్డి మరణించడంతో కొంత సమయం పోయింది. ఈ విషయాలన్నీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు, సినీ పెద్దలకు, పవన్ కల్యాణ్కు తెలుసు. అయినా సినిమాను రాజకీయాల కోసం అర్ధాంతరంగా తేదీని ప్రకటించి.. ఆ తేదీ ప్రకారమే సినిమాను విడుదల చేశారు. తనకోసమే జీవోను ఆలస్యం చేశారనే పరిస్థితికి దిగజారిపోయారు’’
జగన్పై ద్వేషంతో పనిచేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు..
‘‘రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు దారిలో నడవడం సిగ్గుచేటు. సినిమా ఆడినా, ఆడకపోయినా పవన్కు ఆర్థికంగా నష్టం లేదు. చంద్రబాబు వెనుకున్న కొంతమందిని శ్రేయోభిలాషులుగా భావించి వారి సలహాలతో ముందుకెళ్తే 2024 ఎన్నికల్లో జనసేనకు 25-30 సీట్లు ఇస్తారు. ఓడిపోయే సీట్లన్నీ మీకే ఇచ్చి చంద్రబాబును సీఎంగానో, ప్రతిపక్ష నేతగానో చేయడానికి మీరు పావుగా ఉపయోగపడతారు. మీరు సీఎం, ఎమ్మెల్యే అవ్వాలనుకునే వ్యక్తుల్ని శ్రేయోభిలాషులుగా పెట్టుకోవాలి. సీఎం జగన్పై వ్యక్తిగత ద్వేషంతో పనిచేస్తే మీకూ, చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉండదు’’ అని కొడాలి నాని అన్నారు.
ఆ విషయాన్ని పవన్ మర్చిపోయారా?
నరసాపురం సభలో పవన్ మాట్లాడుతూ ఎంత పెద్దవారైనా వంగివంగి నమస్కారాలు పెడితేనే జగన్ అహం సంతృప్తి చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు చిరంజీవిని సీఎం జగన్ తన ఇంటికి ఆహ్వానించారని.. సీఎం సతీమణి భారతి భోజనం పెట్టి పంపించిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ‘‘సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది వ్యక్తిగత సమావేశం కాదు.. సినీ పరిశ్రమకు సంబంధించినది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చిరంజీవి ఆధ్వర్యంలో వారంతా బృందంగా వచ్చారు. క్యాంపు ఆఫీస్కి కారు వెళ్తుందా?కనీసం సీఎం కారు అయినా వెళ్తుందా?అడ్డంగా బారికేడ్లు ఉంటాయి. సీఎం కూడా ఇంటి నుంచి నడుచుకుంటూ క్యాంపు ఆఫీస్కి వస్తారు. మంత్రులు కూడా సెక్యూరిటీ చెక్ తర్వాతే లోపలికి వెళ్తారు. అలాంటిది లోపలికి కారు రానీయకుండా అవమానించారంటూ ఆరోపణలు చేశారు’’
అందర్నీ ప్రేమించే వ్యక్తి చిరంజీవి.. ఆయన గురించి పవన్కు తెలియదా?
‘‘తన మన అనే తేడాల్లేకుండా అందర్నీ ప్రేమించే వ్యక్తి చిరంజీవి. ఎవరి దగ్గరైనా ఆయన ఆ రకంగానే ఉంటారు. సీఎంతో సమావేశంలోనూ ‘పరిశ్రమకు మేలు చేసే తల్లిలాంటి స్థితిలో ఉన్నారు.. మీ సహాయ సహకారాలు కావాలని’ అడిగితే దాన్నీ విమర్శించారు. చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఆయన అభిమానుల ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నం చేశారు. తెదేపా వాళ్లు అన్నారంటే ఓకే.. పవన్కు చిరంజీవి గురించి తెలియదా?వంగి వంగి నమస్కారాలు అనొచ్చా?నీ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవే కదా!. అలాంటి వ్యక్తిని కొందరితో కలిసి అవమానకరంగా మాట్లాడొచ్చా?వాళ్ల ఉచ్చులో పవన్ పడొద్దు. జగన్కు మిత్రుడైన నాగార్జున సినిమాకైనా, రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ సినిమాకైనా ఒకటే రూలు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని.. ప్రజల్ని లూటీ చేసే పరిస్థితులకు ఒప్పుకోమని.. ఎవరినీ ఉపేక్షించొద్దని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేతప్ప ఎవరి సినిమా అనే తారతమ్యాలు లేవు’’
నూటికి నూరు శాతం మళ్లీ జగనే సీఎం..
‘‘వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పి ఓటు అడుగుతాం తప్ప.. ఎవరికోసమో చూసే పరిస్థితి ఉండదు. 2024లో ప్రజల ఆశీస్సులతో నూటికి నూరు శాతం జగనే సీఎం అవుతారు. శ్రేయోభిలాషులుగా ఉన్నట్లు నటిస్తున్న దొంగల మాటలు వినొద్దు. సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి. ప్రతిదాన్నీ రాజకీయాలకు వాడుకోవద్దు’’ అని పవన్ను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!