KTR: మరోసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు.. వాళ్లను నమ్మొద్దు: కేటీఆర్
సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేడు దశాబ్దాలు ఉండి వాళ్లేమి చేయలేదని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సుంకిశాల ఇన్టేక్వెల్కు భూమిపూజ చేసిన అనంతరం కేటీఆర్ హాలియాలో పర్యటించారు.
హాలియా: సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సుంకిశాల ఇన్టేక్వెల్కు భూమిపూజ చేసిన అనంతరం కేటీఆర్ హాలియాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘‘రూ.46వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ తీసుకొచ్చాం. పేదలకు అండగా ఉన్నాం కాబట్టే పింఛన్ను పది రెట్లు పెంచాం. ఆరోగ్యలక్ష్మి ద్వారా తల్లీబిడ్డకు పౌష్ఠికాహారం అందిస్తున్నాం. సన్నబియ్యంతో పౌష్ఠికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యాసంస్థలు ప్రారంభించాం. విదేశీ విద్య కోసం రూ.20లక్షలు ఇస్తున్నాం. రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే సాధించుకున్నాం. రైతులకు ఏదో చేస్తామని.. మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతుంటారు వాళ్లను నమ్మొద్దు’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు