Chandrababu Arrest: ఆంధ్రాలో పంచాయితీ.. అక్కడే తేల్చుకోవాలి: కేటీఆర్
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం.. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం.. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను తెదేపా, వైకాపా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
‘‘చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తగత వ్యవహారం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదు. చంద్రబాబు అరెస్టు అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలి. ఎవరూ అడ్డుకోరు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎలా. తెలంగాణలో ఇవాళ ఒకరు ర్యాలీ చేస్తే.. రేపు మరొకరు చేస్తారు. పక్కింటి పంచాయితీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? విజయవాడలో, అమరావతిలో, రాజమహేంద్రవరంలో ర్యాలీలు చేయండి. ఒకరితో మరొకరు తలపడండి.
చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు..
ఏపీలో ఉన్న సమస్యపై హైదరాబాద్లో కొట్లాడతా అంటే ఎలా? ఇది సరైంది కాదు. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? ఇలాంటి వాటికి ఇక్కడ ఎలా అనుమతిస్తాం. వాళ్ల ఘర్షణలకు హైదరాబాద్ వేదిక ఎలా అవుతుంది. ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు.. స్థానం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడకూడదు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది’’ అని కేటీఆర్ వివరించారు.
లోకేశ్.. పవన్.. జగన్.. నా మిత్రులే..
‘‘లోకేశ్ .. జగన్.. పవన్ కల్యాణ్ నాకు మంచి స్నేహితులు. అందరూ దోస్తులే. ఆంధ్రాలో నాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వారికి కూడా అలాంటి అవసరం లేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్లో అందరూ కలిసి మెలసి ఉంటున్నాం. ఇక్కడ లేని పంచాయితీలు ఎందుకు పెట్టాలి. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు పదేళ్ల నుంచి సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్ ఫోన్ చేయించారు. ఒకరికి అనుమతిస్తే.. ఇంకొకరు ర్యాలీ చేస్తారు. అందుకే అనుమతించడం లేదని చెప్పా. ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమాలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినొద్దు. ఏపీ నుంచి ఎంతో మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ల పెట్టుబడులు, భవిష్యత్తు బాగుండాలి. అలా ఉండాలంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. -
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. -
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. -
Nara Lokesh: ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్
సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. -
ChandraBabu: గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు తెదేపా(TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. -
Telangana Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. -
Kishan Reddy: లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. -
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్ను కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
భారాస (BRS) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ను ఎన్నుకున్నారు. -
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
రాష్ట్ర మంత్రులకు శాఖలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేటాయించారు. -
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్రెడ్డి భేటీ
నూతనంగా ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్రెడ్డి సన్మానించారు. -
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళిసై.. అక్బరుద్దీన్ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు. -
రోడ్డు దిగని జగన్.. పొలం గట్టున బాబు
తుపానుకు దెబ్బతిన్న పంటల పరిశీలన సందర్భమది.. శుక్రవారం పట్టపగలు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. చుట్టూ బారికేడ్లు, పొలం పక్కనున్న రోడ్డు మీద ఎత్తయిన వేదిక.. ఎండ పడకుండా టెంట్లు.. కనీసం రోడ్డు దిగకుండా అక్కడి నుంచే ‘పంట నష్టాన్ని’ పరిశీలించి వెళ్లారు. అదే ప్రాంతానికి అదేరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేరుకున్నారు. -
నేటి నుంచి లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం
తుపాను కారణంగా తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్ర శనివారం మళ్లీ ప్రారంభం కానుంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ఈ యాత్ర ఈ నెల 3న కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల ప్రాంతం వద్దకు చేరుకుంది. -
ప్రభుత్వ ఉదాసీనతతో అన్నదాతకు తీవ్రనష్టం
తుపానుపై వైకాపా ప్రభుత్వ ఉదాసీనత వల్లే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, ఉంగుటూరు మండలం కైకరం, తల్లాపురం గ్రామాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. -
సమన్వయంతో పని చేస్తే అధికారంలోకి..
తెదేపాతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాల్సిన సమయమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మూడు నెలల్లో ఫలితం అనుభవిస్తారు
ప్రజాసమస్యల్ని గాలికొదిలేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ విర్రవీగితే... ఫలితం అనుభవించక తప్పదని జగన్ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటేశాం. -
భయస్థులకు ఎన్నికల్లో పోటీ ఎందుకు?
భయం భయంగా బతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా.. అని సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా.. అని నిలదీశారు. -
ఎన్నికలకు ముందు గ్రూప్-2 ప్రకటన వంచన కాదా?: తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల్ని వంచించడమేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు గట్టి షాక్ తగిలింది. డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో ఆమెపై లోక్సభ శుక్రవారం బహిష్కరణ వేటు వేసింది. -
తిరుపతికి ‘బ్యాండ్’ వేశారు!
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: రాహుల్ ద్రవిడ్ చెప్పిందే ఫాలో అవుతున్నా: రింకు సింగ్
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
-
Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి