KTR: తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్
తెలంగాణ ఏర్పాటైతే భూముల ధరలు తగ్గిపోతాయని గతంలో అపోహలు సృష్టించారని, కానీ, హైదరాబాద్తోపాటు పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లోనూ భూముల ధరలు పెరిగాయని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్దఅంబర్పేటలో నిర్వహించిన ‘భారాస ప్రగతి నివేదన సభ’లో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు. స్వచ్ఛ గ్రామాలు, ఉత్తమ మున్సిపాలిటీ కేటగిరీల్లో రాష్ట్రానికి అధిక అవార్డులు వచ్చినట్లు గుర్తు చేశారు.
‘‘ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.10 లక్షలకు పెరిగింది. ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలోని కొంగర్కలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని అప్పటి నాయకులు అపోహలు సృష్టించారు. ఇప్పుడు హైదరాబాద్, పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లో భూముల ధరలు పెరిగాయి.’’ అని కేటీఆర్ అన్నారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3 వేల కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు.
జన్ధన్ ఖాతాల్లో మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడికి పోయాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. మరోవైపు టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకవ్వడం వాస్తవమేనన్న కేటీఆర్.. అందుకే అప్పటికే పూర్తయిన పరీక్షలను రద్దు చేశామని కేటీఆర్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి 63 రోజులపాటు 95 గ్రామాల మీదుగా 775 కి.మీ పాదయాత్ర చేశారు. ముగింపు సభకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్
మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. -
పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. -
కేసీఆర్, రేవంత్ డూప్ ఫైట్ చేస్తున్నారు: లక్ష్మణ్
హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. -
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి గెలిపిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్ రాణా
భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) ఎన్నికల ప్రచార వీడియో వైరల్ కావడంతో.. విపక్షాలు ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. -
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చింది. బుధవారం రామనవమిని పురస్కరించుకొని ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ఆప్ ప్రారంభించింది. -
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు భాజపా తుడిచిపెట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం పేర్కొన్నారు. -
ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్లు అందజేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. -
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. -
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. -
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. -
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. -
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. -
మంత్రి పెద్దిరెడ్డిది అవినీతి సామ్రాజ్యం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
నాకే పాపం తెలియదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పునరుద్ఘాటించారు. -
175కు 175 స్థానాలూ ఇవ్వండి
‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మరణం
-
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా