KTR: భారాస జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరం: కేటీఆర్
భారాసను అజేయ శక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతీ గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
దిల్లీ: జాతీయ రాజకీయ యవనికపై భారత రాష్ట్ర సమితి బలమైన ముద్ర వేయడం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశ ప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ భారాస శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
భారాసను అజేయ శక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతీ గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందని తెలిపారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. జలదృశ్యంలో ఒకరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ శ్రేణుల పట్టుదలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకమైన భారాస జెండా దిల్లీలో రెపరెపలాడిందన్నారు.
ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న వేళ... భారాస పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని కేటీఆర్ అన్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా ఇప్పుడు దశాబ్దాలపాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందన్నారు. ఉద్యమపాఠాల నుంచి మొదలుకుని యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. ఈ మహాప్రస్థానంలో భారాస వేసిన ప్రతి అడుగు సంచలనమని.. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన