Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎన్పీఏ ప్రభుత్వానికి దేశ ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే.. కానీ, పటిష్ఠ ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు దేశ యువతకు చాలా నష్టం కలిగిస్తాయని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.