Telangana News: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తోంది: మంత్రి ప్రశాంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తోందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏముందో చెప్తే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు పక్షపాతి ఎవరనే విషయం యావత్తు దేశ రైతాంగానికి తెలుసన్నారు. రాహుల్ తెలంగాణలో చెప్పిన మాటలు దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చెప్పాలని, అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు.
‘‘రైతుల పక్షాన పార్లమెంటులో ఏ రోజూ మాట్లాడని రాహుల్ గాంధీ నేడు అల్లాఉద్దీన్ అద్భుత దీపం చేస్తానంటే తెలంగాణ ప్రజలెవరూ నమ్మరు. పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుంది. మనుగడ కష్టమనే పార్టీలకు అతీతంగా తెలంగాణ మీద రాజకీయ మిడతల దండు దండయాత్ర చేస్తోంది. చావుకు సిద్ధపడ్డ కేసీఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తెలంగాణ విషయంలో అడ్డుపడాలని చూస్తే దేశవ్యాప్తంగా అగ్గి పుట్టిస్తాం. కేసీఆర్ లాంటి నాయకుడి సేవలు దేశానికి అవసరమని ప్రజలు, మేధావులు భావిస్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలు తెలిసినవారు తెలంగాణ ప్రజలు. పొలిటికల్ టూరిస్టుల మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు’’ అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు