Andhra news: పవన్‌ కల్యాణ్‌ ‘అన్‌స్టాపబుల్‌’ షోకు వెళ్లడం ఓ వింత: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ధ్వజమెత్తారు. ఆయన కూడా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మార్గంలోనే పయనిస్తున్నారని విమర్శించారు.

Published : 29 Dec 2022 01:20 IST

తిరుపతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైకాపా మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. లోకేశ్‌ పాదయాత్ర.. యువగళం కాదు నారా గళమని ఎద్దేవా చేశారు. తిరుపతిలో క్రీడలు, నృత్యంపై బుధవారం నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కూడా తెదేపా అధినేత చంద్రబాబు మార్గంలోనే పయనిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ ఏ షోలకు వెళ్లని పవన్‌ అన్‌స్టాపబుల్‌ షోకు వెళ్లడం వింతగా ఉందన్నారు. జనసేన నాయకులు తమ అధినేత తీరును గుర్తించాలని సూచించారు. ఆ పార్టీ నాయకులపై వైకాపాకు సానుభూతి ఉందని మంత్రి రోజా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని