Talasani: మోదీజీ.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చప్పగా సాగిందని

Updated : 04 Jul 2022 11:28 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చప్పగా సాగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ధాన్య కొనుగోలు చేశామని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటని.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో తలసాని మాట్లాడారు. 

మోదీ హైదరాబాద్‌ అందాలు చూసి వెళ్లారని.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పలేకపోయారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని.. అనవసరంగా భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం నుంచి భాజపాను తరిమికొట్టాలన్నారు. సభలో నీళ్లు, నియామకాల గురించి అమిత్‌షా మాట్లాడారని.. రెండు రోజులు భాజపా నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా? అని తలసాని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని