Munugode Bypoll: రాజగోపాల్రెడ్డి మూడున్నరేళ్లు గ్రామాలవైపు చూడలేదు: తలసాని
మునుగోడు నియోజకవర్గలో ప్రజా సమస్యల పరిష్కారం తెరాసతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్కాలనీలో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు.
నాంపల్లి: మునుగోడు నియోజకవర్గలో ప్రజా సమస్యల పరిష్కారం తెరాసతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్కాలనీలో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్, భాజపాలపై విమర్శలు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నరేళ్లు గ్రామాల వైపు ఆయన చూడలేదని తలసాని ఆరోపించారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం చేపడుతోందన్నారు. భాజపా నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని చెప్పారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్