సీఎల్పీ నేత భట్టి ఇంటికి మంత్రి తలసాని

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..రాష్ట్ర మంత్రి తలసాని వెంట రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు వెళ్లారు. నిన్న శాసనసభలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల...

Updated : 17 Sep 2020 12:11 IST

హైదరాబాద్‌: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..రాష్ట్ర మంత్రి తలసాని వెంట రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు వెళ్లారు. నిన్న శాసనసభలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణంపై ఇరువురు నేతల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తాయని భట్టి విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో లక్ష డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని సవాల్‌ విసిరారు.  భట్టి సవాల్‌ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిర్మాణాలను స్వయంగా చూపిస్తానని స్పష్టం చేశారు. ఆమేరకు గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని.. మేయర్‌ రామ్మోహన్‌తో కలిసి వెళ్లారు. శ్రీనివాస్‌ యాదవ్‌ కారులోనే ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు ఇరువురు నేతలు వెళ్లారు. తొలుత జియాగూడలోని ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని