ఆంధ్రా నాయకులు ఏం సమాధానం చెబుతారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మంత్రి
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిందన్నారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టును కట్టవద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందన్నారు. బోర్డు ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అక్రమమని తేలిపోయిందని.. దీనిపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలను కట్టొద్దని హరిత ట్రైబ్యునల్ చెప్పిందని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం నిబంధనలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయాలని ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన వారంలోనే కృష్ణా బోర్డును ఆశ్రయించామని.. గతేడాది జులై 25న మరోసారి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రం, కృష్ణా బోర్డుకు ఏడు లేఖలు రాసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ఎందుకు పోరాడదు?
‘‘ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం నాలుగు రేట్లు పెంచింది కాంగ్రెస్ హయాంలో కాదా? వైఎస్సార్ సీమకు నీళ్లు తీసుకెళ్తుంటే డీకే అరుణ హారతి పట్టారు. ఏపీ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎందుకు పోరాడదు?మల్లన్నసాగర్పై కోర్టులకు వెళ్లే కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. ఈ విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏపీ ప్రాజెక్టులపై రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం