ఈ-క్రాప్‌ నమోదులో భారీ అవినీతి: బాలకృష్ణ

రంగుమారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురం

Published : 08 Jan 2021 01:15 IST

అనంతపురం: రంగుమారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగించిన బాలకృష్ణ వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌లో అవినీతి తారస్థాయిలో జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే దిల్లీ తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని