
Telangana news: అధికారం ఉందని విచక్షణ లేకుండా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు: ఈటల రాజేందర్
హైదరాబాద్: సంపన్న రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. కేసీఆర్ డొల్లతనాన్ని కాగ్ సైతం బయటపెట్టిందని పేర్కొన్నారు. అయితే కాగ్ నివేదికలు బయటకు రాకుండా దాచిపెట్టారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు ఏవీ అప్పులు తీర్చే పరిస్థితిలో లేవని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం రుణాలకు దేశమంతా ఒకే విధానం వర్తిస్తుందని పేర్కొన్నారు. మంత్రులకు వారి శాఖల మీద ఎలాంటి అవగాహన లేదని.. వారి మాటలకు విలువ లేదన్నారు. మిల్లర్లు క్వింటాల్కు 8 కిలోలు తరుగు తీస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని ఈటల మండిపడ్డారు.
‘‘అధికారం ఉంది కదా అని.. విచక్షణ లేకుండా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు. తెలంగాణ ప్రజలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే జాతీయ రాజకీయాలు అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తలదూర్చితే.. తెదేపా అధినేత చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది. రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలి. మోదీకి కాదు ప్రధాని కుర్చీకి గౌవరం ఇవ్వాలన్న కేసీఆర్.. ఇవాళ ప్రధానిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని పర్యటన ఉందని తెలిసి.. మోదీకి ముఖం చూపించే దైర్యం లేకనే దిల్లీ పర్యటనకు వెళ్లారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు నిబద్ధత ఉంది కాబట్టే విద్యా, వైద్య రంగాల్లో ప్రగతిని సాధించారు’’ అని ఈటల తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్రెడ్డి
-
Technology News
iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
-
India News
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)