Telangana News: నేనేం మాట్లాడినా పార్టీ కోసమే.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా: జగ్గారెడ్డి

పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తానేం మాట్లాడినా పార్టీ మంచి

Published : 04 Jul 2022 16:14 IST

హైదరాబాద్‌: పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తానేం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనని, పార్టీ లైన్‌లోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొన్ని ప్రచార మాధ్యమాలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. త్వరలో మళ్లీ అన్ని విషయాలు వెల్లడిస్తా. నేను ఎవరికీ భయపడను. నేను అనుకున్నదే మాట్లాడతా. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కట్టుబడి ఉన్నా. మా పార్టీ నాయకులతోపాటు బయటి వాళ్లూ నాపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఒత్తిళ్లకు లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా? పార్టీ కోసం కలిసి పనిచేస్తా’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని